శేరిలింగంపల్లిమనవార్తలు ప్రతినిధి :
త్రో బాల్ క్రీడలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లో గల జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు త్రో బాల్ క్రీడలో గత నెల డిసెంబర్ నెల 13 నాడు టి కే ఆర్ కళాశాల ఆవరణలో నిర్వహించిన జాతీయ స్థాయి త్రో బాల్ క్రీడల ఎంపికలో జ్యోతి విద్యాలయ హై స్కూల్ విద్యార్థులు శాన్వి, తనుశ్రీ, అమీనా, వృతిక లు ఎంపికై జార్ఖండ్ రాష్ట్రo లో డిసెంబర్ 27,28,29 తేదీల్లో జరిగిన 31 వ జాతీయ త్రో బాల్ పోటిల్లో చక్కటి ప్రదర్శన తో 3 వ స్థానం లో నిలిచారు. ఈ జాతీయ క్రీడలో శాన్వి రెండు సార్లు, తనుశ్రీ ఒక సారి పాల్గొని మంచి ప్రదర్శన తో ఉత్తమ క్రెడాకారులుగా నిలిచి ఆకట్టుకున్నారు. వీరిని స్కూల్ కరస్పాండెంట్ అంబ్రోస్ బెక్, ప్రిన్సిపాల్ ఉమా మహేశ్వరీ, వ్యాయామ ఊధ్యాయులు బాల, వేణుకుమార్ లు అభినందించారు.ముందు ముందు మరిన్ని పోటిల్లో విజయాలు సాధించిన స్కూల్ కు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.