గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

politics

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం పూర్తి గీతాన్ని సామూహికంగా పాడారు. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ప్రేరేపించిన, జాతీయ ఐక్యత, మాతృభూమి పట్ల భక్తికి ప్రతీకగా నిలిచిన జనాదరణ పొందిన కూర్పుకు ఈ కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు.గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన దేశవ్యాప్త ఉత్సవాలలో భాగంగా ఈ వేడుకలను నవంబర్ 2025 నుంచి నవంబర్ 2026 వరకు ఏడాది పొడవునా జాతీయ గీతం స్మారకోత్సవం నిర్వహిస్తున్న విషయం విదితమే.భారతదేశ గొప్ప సాంస్కృతిక వారతస్వం, దేశభక్తి పట్ల తమ గౌరవాన్ని పునరుద్ఘాటిస్తూ గీతం అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *