యోగాతో శారీరక, మానసిక ప్రశాంతత లభిస్తుంది…
-బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్
పటాన్ చెరు:
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇస్నాపూర్ లో పటాన్ చెరు మాజీ జెడ్పీటీసీ, బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, యువకులతో కలిసి యోగాసనాలు చేశారు.అనంతరం శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ.. యోగాతో శారీరకంగానే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందన్నారు.
కరోనా నేపథ్యంలో మనం వ్యాధినిరోధకతను పెంచుకోవడంతో పాటు శారీరకంగా చురుకుగా, మానసికంగా ప్రశాంతంగా ఉండడం కోసం ప్రతి ఒక్కరూ ఈ పురాతన అభ్యాసాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ వల్లే ప్రపంచ దేశాలు యోగాను అంగీకరించాయని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, దీపక్, షకీల్ , దశరత్, బాచి, మహెష్, రాకుష్ తదితరులు పాల్గొన్నారు.