మద్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు…
పటాన్ చెరు :
అక్రమంగా మద్యాన్ని ఇంట్లో నిల్వ ఉంచి విక్రయిస్తున్న వ్యక్తి పై కేసు నమోదు చేసిన సంఘటన పటాన్ చెరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి,ఎస్ఐ వెంకటేశం కథనం ప్రకారం .. పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల గ్రామంలో సాయికుమార్ అనే వ్యక్తి కిరాణా షాపు నడుతున్నాడు.
అందులో మద్యం దాచి విక్రయిస్తున్నాడని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు దాడులు నిర్వహించారు . ఈ దాడుల్లో వివిధ బ్రాండ్లకు చెందిన 250 మద్యం బాటిళ్లను సీజ్ చేసి సాయికుమార్ పై కేసు నమోదు చేశారు.ఈ కార్యక్రమంలో ట్రెయినీ ఎప్ శ్రీనివాస్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.