జిటో ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ ప్రారంభం...
హైదరాబాద్:
కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలతో కూడిన కోవిద్ కేర్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లెమన్ ట్రీ హోటల్ లో వంద పడకల తో ఈ కోవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు జిటో హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ కుషల్ కంకరియా తెలిపారు.
ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ ఆరోగ్యశాఖ అనుమతితో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కోవిద్ కేర్ సెంటర్లో 24 గంటలు డాక్టర్లు నర్సులు ఇతర డయాగ్నస్టిక్ సేవలతో పాటు ఉచితంగా ఆహారాన్ని అందిస్తున్నట్లు జీతో హైదరాబాద్ చీఫ్ సెక్రెటరీ మహేష్ తెలిపారు