మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలని తెలంగాణ రాష్ట్ర యూత్ ప్రోటోకాల్ చైర్మన్ ఆదిత్యరెడ్డి అన్నారు . బుధవారం పటాన్చెరు పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థ యూరో కిడ్స్ లో ‘నేషనల్ డాక్టర్స్ డే’ వేడుకలకు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు .చిన్నారి విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు . అనంతరం మాట్లాడుతూ సమాజంలో వైద్యులకు అత్యున్నతమైన స్థానం ఉందనీ, కష్టకాలంలో ప్రాణాలు నిలిపే డాక్టర్లు ప్రత్యక్ష దైవాలనీ, ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే వైద్యుల సేవలను, వారి విలువలను గౌరవించడం అలవాటు చేసుకోవాలనీ విద్యార్థులకు ఆయన సూచించారు .
