అర్హులైన వారికి ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా కృషి చేస్తాం.. నగేష్ నాయక్

politics Telangana

మన వార్తలు, శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఉన్న అదిత్యనగర్ కి చెందిన అర్హులైన నిరుపేద ప్రజలకి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలు అమలుకు కృషి చేస్తానని మధాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి. నగేష్ నాయక్ అన్నారు. ఆదిత్య నగర్ కాలనీ లో మహిళలు, యువకులు సమావేశం ఏర్పాటు చేసి వారినుండి దరఖాస్తులను స్వీకరించి సంభందిత అధికారులకి అందజేసి ఆరు గ్యారెంటీ పథకాలు అర్హులకు అందేలా శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు. మాదాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా నూతనంగా ఎన్నికైన డి. నగేష్ నాయక్ ను ఆదిత్యనగర్ కి చెందిన మహిళలు, యువత శాలువాతో సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మునాఫ్, రహీమ్, చాంద్, హస్సన్, షమీ,ఫాతిమా, పెద్ది శెట్టి ప్రసాద్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *