_రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ కు ఫిర్యాదు
ఎమ్మిగనూర్,మక్బుల్ బాషా,మనవార్తలు ప్రతినిధి :
ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను అన్య క్రాంతమ్ కాకుండ కాపాడాలని కోరుతూ ముగతి పేట మజీద్ పెద్దలు అల్ హజ్ తురేగల్ మొహమ్మద్ యూసుఫ్ లు మంగళవారం కర్నూలు కలెక్టరేట్ లో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ వేదిక గా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముస్లిం మైనారిటీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ ను కలసి ఫిర్యాదును అందజేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ముగతి మోహల్ల మజీద్ భూములను కాపాడాలని, ముగతి పేట మజీద్ కి సంబంధించిన భూమి నందవరం మండలం ముగతి గ్రామంలో 147/సి సర్వేనంబర్ లో 22.92 కలదని,ఈ భూమిని రెవెన్యూశాఖ అధికారులు అన్యాక్రాంతంగా ఇతరుల పేర్లు నమోదు చేసిన భూమిని వెంటనే మజీద్ పేరు మీద ఆన్లైన్ చేయవలసినదిగా కోరారు.అలాగే ఎమ్మిగనూరు మండలం రాళ్ళదొడ్డి గ్రామంలో 21 ఎకరాల వక్ఫ్ భూమి ని సర్వే చేసి స్వాధీనం చేయాలని ఫిర్యాదులో తెలిపారు.అలాగే ఏప్రిల్ నెలనుండి ఇమామ్ లకు మౌజాన్ లకు జీతలు రావటం లేదని, తక్షణమే మంజూరు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలోడేగుల పాడు వలి, కటంబ్లీ షఫీ, ఖాజా. తురేగల్ మక్బుల్ బాష తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…