Telangana

ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ జయప్రదం చేద్దాం

వచ్చేనెల 8 నుండి 10 వరకు సంగారెడ్డిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు

_ప్లీనరీ వాళ్లు పోస్టర్ ఆవిష్కరణలో రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కారాములు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

వచ్చేనెల 8 నుండి సంగారెడ్డిలో జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని రాష్ట్ర ప్లీనం ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని శ్రామిక్ భవన్ లో జరిగిన సమావేశంలో చుక్కా రాములు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ప్లీనరీ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ప్లీనరీ గౌరవ అధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు మాట్లాడుతు విద్యరంగ,విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ అనునిత్యం పోరాడుతుందన్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలపై అనునిత్యం విద్యార్థుల పక్షాన నిలబడే సంఘం ఎస్ఎఫ్ఐ. సంఘం ప్లీనరీ సమావేశలు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరుగుతుందని.ఈ సమావేశంలో గత కార్యక్రమాలు, విద్యా రంగంలో పాలకులు తీసుకు వస్తున్న విధానాలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశాలకు జాతీయ అధ్యక్ష కార్యదర్శులు మయూక్ బిస్వాస్, విపి సాను ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు చెప్పారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఎస్ఎఫ్ఐ చేస్తున్న కృషికి తోడుగా విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చేనెల 8 న విద్యార్థుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఉంటుందని, 9,10 తేదీ లో జరిగే సమావేశాల జయప్రదం కోసం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్ మెంట్ రాక ఇబ్బంది పడుతున్నారని. పెండింగ్ లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని, అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకులాలకు సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, పెండింగ్ లో ఉన్న మేస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని అన్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని రాష్ట్ర ప్లీనరీ సమావేశలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటికొండ రవి, రాష్ట్ర ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షుడు మాణిక్యం, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎర్రోళ్ల మహేష్, నల్లబెల్లి రమేష్ సహాయ కార్యదర్శి రజినీకంత్, రవి, సాయి, రజినీకాంత్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

7 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago