Telangana

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర అన్నారు . పటాన్‌చెరు నియోజకవర్గంలోని ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో 45 ఆవులు ఉన్న వాహనాన్ని గుర్తించి విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు అడ్డుకోగా వారిపైన గోమాఫియా దాడి చేశారు . ఈ ఘటనపై విహెచ్‌పీ, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు పటాన్‌చెరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ అధికారులు స్పందిస్తూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర మాట్లాడుతూ ముత్తంగి రింగ్‌రోడ్ సమీపంలో గో రక్షణ కార్యకర్తలపై జరిగిన దాడి ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది అని గో సంరక్షణ కోసం పనిచేస్తున్న కార్యకర్తలపై గో మాఫియా దారులు దాడి చేసి, వారి వద్ద ఉన్న బంగారు గొలుసు, చేతి గడియారం మరియు సుమారు ₹45,000 నగదు దోచుకున్నారని,గో రక్షణ కార్యకర్తలపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని, దోపిడీకి గురైన బంగారం, వాచ్ మరియు నగదు తిరిగి ఇప్పించాలని పోలీసుల ద్వారా పంపించిన ఆవులను తిరిగి గోశాలలకు అప్పగించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ విభాగ్ సంయోజక్ మనోజ్, బీజేపీ నాయకులు బెజుగం శ్రీనివాస్, రాజశేఖర్ రెడ్డి, రవీందర్, గోశాల సభ్యులు విఠల్, అడ్వకేట్ రమేష్, బజరంగ్ దళ్ ప్రఖండ ప్రాముఖ్ సందీప్, గోరక్ష ప్రాముఖ్ సాయితేజ, నగర ప్రాముఖ్ సూరజ్, రాజగోపాల్, సంగమేశ్, సాయి, చేతన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

admin

Recent Posts

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago

జూలై 18న ఛలో యువ సంగ్రామ సదస్సు

పటాన్‌చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది హాజరు మోసాలకు చిరునామా కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్ అమలులో ఘోర వైఫల్యం…

3 days ago