Telangana

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తిరుమలలో భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఉదయం స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ అనంతరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను ఎమ్మెల్యేకు అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పటాన్‌చెరు నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం నెలకొనాలని మనస్ఫూర్తిగా ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సుభిక్షం, అభివృద్ధి చేకూరాలని స్వామివారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే జిఎంఆర్ తో పాటు గూడెం సందీప్ రెడ్డి, సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి, సోమ శీనయ్య, సుధాకర్ గౌడ్, స్వామి వారిని దర్శించుకున్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago

జూలై 18న ఛలో యువ సంగ్రామ సదస్సు

పటాన్‌చెరు నియోజకవర్గం నుండి 5 వేల మంది హాజరు మోసాలకు చిరునామా కాంగ్రెస్ నిరుద్యోగ డిక్లరేషన్ అమలులో ఘోర వైఫల్యం…

3 days ago