Telangana

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు:

భక్తుల జయ జయ ధ్వనాల మధ్య పటాన్‌చెరు పట్టణంలో పూరి జగన్నాథుడి రథయాత్ర అత్యంత వైభవంగా సాగింది. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయం వద్ద హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన రథయాత్రను పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై బంగారు చీపురుతో రథయాత్ర మార్గాన్ని ఊడ్చి రథాన్ని లాగి ప్రారంభించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై జగన్నాథ, బలబద్ర, సుభద్రల విగ్రహాలను అందంగా అలంకరించారు. చిన్నారులు, మహిళలు, హరే రామ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ సభ్యులు కీర్తనలు పాడుతూ పట్టణ పుర వీధుల గుండా రథయాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పూరిలో జరిగే జగన్నాథుడి రథయాత్ర ప్రపంచంలోనే అతి పురాతనమైన హిందూ ఆధ్యాత్మిక ఉత్సవమని అన్నారు. పటాన్‌చెరు పట్టణంలో జగన్నాథుడి రథయాత్రను ఏర్పాటు చేయడం పట్ల ఆయన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక పటాన్‌చెరు నియోజకవర్గమని తెలిపారు. దేశంలోని 27 రాష్ట్రాల ప్రజలు నియోజకవర్గంలో నివసిస్తున్నారని తెలిపారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని బంగారుగడ్డ వద్ద మూడు ఎకరాల విస్తీర్ణంలో బాలాజీ దేవాలయం, శ్రీకృష్ణుని దేవాలయం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. భక్తులందరి సహాయ సహకారాలతో త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. భగవంతుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, సపాన దేవ్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, నర్ర బిక్షపతి, పృథ్వీరాజ్, అశోక్, నర్సింలు, చంద్ర శేఖర్, మల్లేష్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

3 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

3 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

3 days ago