5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన తౌఫిక్ అలీ) శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. పటాన్ చెరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి పైన బస్సులు ఆగే స్థలంలో బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న ఎర్రటి బ్యాగులో ఉన్న ఐదు తులాల బంగారము( మంగళసూత్రం, హారం,రింగులు) నాలుగువేల నగదును గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. దిగుతున్న సమయంలో చూసుకోగా బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…