5 తులాల బంగారం, నాలుగు వేల నగదు దొంగిలించిన గుర్తుతెలియని వ్యక్తులు
పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఆర్టీసీ బస్సు దిగే లోపే ఓ మహిళ నుంచి బంగారం, నగదు దొంగతనానికి గురైన సంఘటన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. బాధితులు పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంగారెడ్డి శాంతినగర్ కు చెందిన రేష్మ బేగం భర్త (శాండ్విక్ పరిశ్రమకు చెందిన తౌఫిక్ అలీ) శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఇస్నాపూర్ చౌరస్తాలో పటాన్ చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు. పటాన్ చెరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జాతీయ రహదారి పైన బస్సులు ఆగే స్థలంలో బస్సు దిగే సమయంలో తన వద్ద ఉన్న ఎర్రటి బ్యాగులో ఉన్న ఐదు తులాల బంగారము( మంగళసూత్రం, హారం,రింగులు) నాలుగువేల నగదును గుర్తుతెలియని దొంగలు దొంగిలించారు. దిగుతున్న సమయంలో చూసుకోగా బ్యాగు కనిపించకపోవడంతో వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…