మనవార్తలు ,నంద్యాల :
మొన్న వెలుబడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండవ స్థానాన్ని సాధించాడని కళాశాల డైరెక్టర్లు ఎం.చంద్రమౌళిశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేటగిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మధ్యలో రావచ్చని వారు వెల్లడించారు. సబ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో 92.31 శాతం మ్యాథ్స్ లో 88.36 శాతం సాధించి మొత్తం93.33 శాతం సాధించినట్లు తెలిపారు. కళాశాల పేరు ప్రతిష్టలను దశదిశలా వ్యాప్తి చేసిన కడియం రాజును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఆల్ ఇండియా టాప్ ఎన్ఐటీ కళాశాలలో సీటు సాధించే అర్హతను సాధించినందుకు రాజుకు అభినందనలు తెలిపారు .
మొదటి నుంచి నిష్ణార్థులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాలు సాధనకు కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. త్వరలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…