మనవార్తలు ,నంద్యాల :
మొన్న వెలుబడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండవ స్థానాన్ని సాధించాడని కళాశాల డైరెక్టర్లు ఎం.చంద్రమౌళిశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేటగిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మధ్యలో రావచ్చని వారు వెల్లడించారు. సబ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో 92.31 శాతం మ్యాథ్స్ లో 88.36 శాతం సాధించి మొత్తం93.33 శాతం సాధించినట్లు తెలిపారు. కళాశాల పేరు ప్రతిష్టలను దశదిశలా వ్యాప్తి చేసిన కడియం రాజును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఆల్ ఇండియా టాప్ ఎన్ఐటీ కళాశాలలో సీటు సాధించే అర్హతను సాధించినందుకు రాజుకు అభినందనలు తెలిపారు .
మొదటి నుంచి నిష్ణార్థులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాలు సాధనకు కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. త్వరలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…