_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి
_సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
మనవార్తలు ,పటాన్ చెరు;
రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఉస్మానగర్, వెలిమెల, సందు గూడెం, పాశమైలారం పరిధిలోని టీఎస్ఐఐసి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…