_టీఎస్ ఐ ఐ సి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించండి
_సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్
మనవార్తలు ,పటాన్ చెరు;
రాష్ట్ర ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు.పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్ల పరిధిలో మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రధానంగా సిసి రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, పేపర్ అభివృద్ధి పనులకు 100 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు అందించినట్లు ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఉస్మానగర్, వెలిమెల, సందు గూడెం, పాశమైలారం పరిధిలోని టీఎస్ఐఐసి భూములను స్థానిక అవసరాల కోసం బదలాయించాలని విజ్ఞప్తి చేశారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్, త్వరలోనే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిపారు.ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…