సీల అభ్యున్నతికి సీఎం జగన్ కృషి
అనంతపురం :
బి సి ల అభ్యున్నతి లక్ష్యం గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే అనంత నివాసంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నాయీబ్రాహ్మణ సంక్షేమ బుక్ ను ఎమ్మెల్యే అనంత విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత టీడీపీ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంక్ గా మాత్రమే వాడుకుంది తప్పా ఏనాడు వారి అభివృద్ధి, సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు.
ప్రతిపక్ష నేత హోదాలో వై ఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు కళ్ళారా చూసి అధికారంలోకి రాగానే ఆయా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు 56 బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను సైతం నియమించారన్నారు. నాయిబ్రాహ్మణుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అందులో భాగంగా షేవింగ్ షాపులకు ఏటా రూ.10 వేలు అందించడంతోపాటు విద్యుత్ సబ్సిడీని కూడా అమలు చేస్తున్నారని తెలిపారు.
ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణులకు అమలవుతున్న సంక్షేమ పథకాలను వివరించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ శ్రీనివాసులుని ఎమ్మెల్యే అనంత అభినందించారు.కార్యక్రమంలో కొండ్రెడ్డి ప్రకాష్ రెడ్డి,నవీన్,అనిల్,హౌసింగ్ బోర్డ్ రామకృష్ణ,నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు విజయభాస్కర్, బయన్,శివకుమార్,బంకుశీను,మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…