అనంతపురం :
గ్రామీణ స్థాయి నుంచే క్రీడాకారులను ప్రోత్సహించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. చదువుతో పాటు క్రీడలూ అవసరమేనన్నారు. ఆ దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు.ఇటీవల విశాఖపట్నం వేదికగా జరిగిన జాతీయ స్థాయి బాలికల బాక్సింగ్ పోటీల్లో నగరానికి చెందిన దీక్షిత,పెద్దక్క,శిల్ప,గీత,పూజలు పతకాలు సాధించారు. వీరంతా మంగళవారం ఎమ్మెల్యే అనంతను ఆయన స్వగృహంలో కలిశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు. భవిష్యత్లో మరింతగా రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలంపిక్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనంత చంద్రారెడ్డి, బాక్సింగ్ కోచ్ మహేష్ కుమార్,అబ్జల్ తదితరులు పాల్గొన్నారు
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…