అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…
– ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్
పటాన్ చెరు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల ప్రకారం జి ప్లస్-2 భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు, జి ప్లస్-2 మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జి ప్లస్-2 ఆపై నిర్మించాలని కొనేవారు ఖచ్చితంగా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. అనుమతు లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలకు నోటీసులిచ్చి కూల్చివేస్తామని హెచ్చరించారు. కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దుర్గారెడ్డి, రాజు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…