అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు…
– ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్
పటాన్ చెరు:
ప్రభుత్వ నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ అనుమతి ఇచ్చిన మేరకే నిర్మాణాలు చేపట్టాలని ఇంద్రేశం ఇంచార్జి సర్పంచ్ బండి హరిశంకర్ బిల్డర్లకు సూచించారు. మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇంద్రేశం గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ కార్యదర్శి సుభాష్ అధ్యక్షతన బిల్డర్ల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సర్పంచ్ బండి హరీష్ శంకర్ మాట్లాడుతూ… పంచాయతీ అనుమతుల ప్రకారం జి ప్లస్-2 భవన నిర్మాణాలు చేపట్టాలన్నారు, జి ప్లస్-2 మించి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జి ప్లస్-2 ఆపై నిర్మించాలని కొనేవారు ఖచ్చితంగా హెచ్ఎండీఏ అనుమతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలని పేర్కొన్నారు. అనుమతు లు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టిన భవనాలకు నోటీసులిచ్చి కూల్చివేస్తామని హెచ్చరించారు. కూల్చివేసిన వాటిని తిరిగి నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు దుర్గారెడ్డి, రాజు, బిల్డర్లు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: వ్యర్థాల నుంచి సంపద (శ్రేయస్సు)ను సృష్టిస్తున్న హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ఐఐటీ…
ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో నూతన దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు…
ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న ఐఐటీ హైదరాబాదు అధ్యాపకుడు డాక్టర్ ప్రభాత్ కుమార్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రకృతి, భౌతికశాస్త్రం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరు నియోజకవర్గం, ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని ఐనోలు గ్రామంలో సోమవారం శ్రీశ్రీశ్రీ మల్లికార్జున స్వామి…