మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి 23 వరకు ‘ఎంబెడెడ్ సిస్టమ్స్ డిజైన్, ఆటోమేషన్’ పై ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో అధ్యాపకులు, విద్యార్థులు వాస్తవ-ప్రపంచ సెన్సార్ ఇంటర్ ఫేసింగ్ ను ఆచరణాత్మకంగా నేర్చుకుంటున్నారు.స్మార్ట్ ఎనర్జీ మానిటరింగ్ సిస్టమ్స్, ఇండస్ట్రియల్ గేట్ వే సొల్యూషన్స్ వంటి అప్లికేషన్లను అభివృద్ధి చేయడంలో ఈ నైపుణ్యాలను ఉపయోగిస్తారు. అంతేగాక, జాతీయ విద్యా విధానం 2023కు అనుగుణంగా పాఠ్యాంశాలను మెరుగుపరచడం, ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, ఆవిష్కరణలపై నైపుణ్యం-ఆధారిత విద్యకు ఈ శిక్షణ ఉపకరించనుంది.బెంగళూరులోని పైటెక్ టెక్నికల్ మేనేజర్ గోపాల్, ఎంబెడెడ్ సాఫ్ట్ వేర్ డెవలపర్ హరీష్ ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, ఈఈసీఈ అధ్యాపకులు, విద్యార్థులు ఇందులో చురుకుగా పాల్గొంటున్నారు.పైటెక్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్, ఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి పర్యవేక్షణలో, డాక్టర్ పి.వి. రామకృష్ణ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…