Telangana

అంతర్జాతీయ సదస్సులో గీతం వాణి

ప్రతిష్టాత్మక సదస్సులో కీలకోపన్యాసం చేసిన సీఎస్ఈ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని సీఎస్ఈ విభాగం అధ్యాపకురాలు ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్ లో స్మార్ట్ ట్రెండ్స్ (స్మార్ట్ కామ్-2026) పదో అంతర్జాతీయ సమావేశం ప్రారంభోత్సవంలో అతిథిగా పాల్గొని, కీలకోపన్యాసం చేశారు. సమకాలీన పరిశోధన దిశ, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ల డొమైన్ లలో ఇటీవలి సాంకేతిక పురోగతిపై విలువైన అంతర్దృష్టులను పంచుకున్నారు. ఆమె ప్రసంగం సదస్యుల మన్ననలను పొందింది.పూణే (మహారాష్ట్ర)లోని క్రౌన్ ప్లాజా సిటీ సెంటర్ లో హైబ్రిడ్ విధానంలో ఈనెల 19 నుంచి 21 వరకు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సమావేశంలో ప్రపంచ నలుమూలల నుంచి పలువురు ప్రొఫెసర్లు, నిపుణులు పాల్గొంటున్నారు. గ్లోబల్ నాలెడ్జ్ రీసెర్చ్ ఫౌండేషన్ (జీకేఆర్ఎఫ్), జీ.ఆర్. స్కాలస్టిక్ ఎల్ఎల్ పీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ జాతీయ ఛాంబర్ పార్టనర్ గా, స్ర్పింగర్ పబ్లికేషన్ పార్టనర్ గా వ్యవహరిస్తున్నాయి.అత్యాధునిక పరిశోధన, ఇన్ఫర్మేషన్, కంప్యూటర్ కమ్యూనికేషన్స్ లో ఉద్భవిస్తున్న ధోరణులపై ఈ సమావేశం దృష్టి సారించింది. పరిశోధకులు, విద్యావేత్తలు, పరిశ్రమ నిపుణులు, విద్యార్థులు తమ జ్జానం, ఆలోచనలను ఒకరితో మరొకరు పంచుకోవడానికి ఈ సదస్సు తోడ్పడుతోంది. దాదాపు 50కి పైగా దేశాల నుంచి 400కి పైగా పరిశోధనా పత్రాలను పరిశోధకులు సమర్పించారు.డాక్టర్ ప్రీతి విశిష్ట విద్యా నైపుణ్యం, పరిశోధన నాయకత్వం, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ఉన్నత విద్యకు చేసిన గణనీయమైన కృషిని ఈ ప్రాతినిధ్యం ప్రతిబింబిస్తోంది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago