Telangana

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత

మనవార్తలు ప్రతినిధి,మియాపూర్:

తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, క్రీడలు మరియు యువజన సేవల శాఖల గౌరవ మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి అన్నారు.యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు , చైర్మన్ శ్రీ యలమంచి ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి ప్రణవ్ మాధవ్ సురపనేని అభినందించారు.ప్రణవ్ మాధవ్ సురపనేనిని ఘనంగా శాలువాతో సత్కరించారు. అనంతరం మాట్లాడుతూ కేవలం 17 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభను కనబరుస్తూ తెలంగాణతో పాటు భారతదేశానికి గర్వకారణంగా నిలుస్తున్న ప్రణవ్ మాధవ్ సురపనేని సాధించిన విజయాలను అడిగి తెలుసుకొన్నారు .క్రీడల పట్ల ప్రణవ్ చూపుతున్న అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల మరియు ప్రతిభకు సాధించిన విజయాలు నిదర్శనమని పేర్కొన్నారు.తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ వేదిక వరకు ప్రణవ్ సాగిస్తున్న ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను ప్రోత్సహించి, వారికి అవసరమైన అవకాశాలు మరియు సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి మరిన్ని పతకాలు సాధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.ప్రణవ్ వంటి యువ ప్రతిభావంతులు తెలంగాణ క్రీడా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు, భారతదేశానికి మరింత కీర్తి ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆకాంక్షించారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago

అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య

రేషన్ షాపులలో 14 రకాల వస్తువులను ఇవ్వాలి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలిసిపిఎం ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా …

2 days ago