మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో
కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష
సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఒకరిని విధుల నుండి తొలగిస్తూ, మరో ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులుఅందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా వైద్యధికారిణి ని ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో డాక్టర్ అజ్మనాజ్ ను విధులను తొలగించాలని డిఎం అండ్ హెచ్ ఓ గాయత్రి దేవి కి ఆదేశించారు. దౌల్తాబాద్ ,మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే లో రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు కేసులో రెఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి సూచనలు సలహాలు, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి దేవి, జిజిహెచ్ సూపర్డెంట్ అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…
ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…