Telangana

విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యాధికారిని విధుల నుండి తొలగింపు

మాతా శిశు సంరక్షణ కార్యక్రమాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో

కలెక్టర్ క్రాంతి వల్లూరు సమీక్ష

సంగారెడ్డి ,మనవార్తలు ప్రతినిధి :

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న ఒకరిని విధుల నుండి తొలగిస్తూ, మరో ఇద్దరు వైద్యాధికారులకు షోకాస్ నోటీసులుఅందించాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి , జిల్లా వైద్యధికారిణి ని ఆదేశించారు.కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో జిల్లాలో మాతా శిశు మరణాలు, మహిళా శిశు సంక్షేమ కార్యక్రమాలపై కలెక్టర్ వల్లూరు క్రాంతి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ అజ్మనాజ్ ఆసుపత్రికి వచ్చిన గర్భిణులను ప్రైవేట్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలడంతో డాక్టర్ అజ్మనాజ్ ను విధులను తొలగించాలని డిఎం అండ్ హెచ్ ఓ గాయత్రి దేవి కి ఆదేశించారు. దౌల్తాబాద్ ,మల్చల్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఇద్దరు డాక్టర్లకు షోకాజు నోటీసులు అందజేయాలని ఆదేశించారు. ఈ సమీక్ష సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే లో రిస్కు కేసులు ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించేలా చూడాలన్నారు. హై రిస్కు కేసులో రెఫర్ చేస్తున్నప్పుడు డాక్టర్లు సమన్వయంతో కోఆర్డినేషన్ చేసుకోవాలన్నారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు క్రమం తప్పకుండా గర్భిణులను పరిశీలించి వారికి సూచనలు సలహాలు, పౌష్టికాహారం, మందులు వాడేలా చర్యలు చేపట్టాలన్నారు. వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, సెంటర్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి దేవి, జిజిహెచ్ సూపర్డెంట్ అనిల్ కుమార్, జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల వైద్యాధికారులు ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లు పాల్గొన్నారు

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago