ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ అయిన మోల్ సాప్టును ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో లోతైన అవగాహనను కల్పించడంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించినట్టు ఆయన తెలియజేశారు.మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్ పరిచయం, డాకింగ్ మోడల్స్ యొక్క ఆఫ్టిమైజేషన్ అండ్ వాలిడేషన్, డ్రగ్ డిస్కవరీలో రియల్-వరల్డ్ కేస్ స్టడీస్ వంటి ముఖ్య అంశాలపై ఈ కార్యశాలలో తర్ఫీదు ఇస్తామన్నారు.పుణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లో అప్లికేషన్ సైంటిస్ట్ ఆదిత్య మిశ్రా ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా పాల్గొంటారని తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో నిమగ్నమైన నిపుణుల కోసం దీనిని రూపొందించామని, కేవలం 30 మందికి మాత్రమే పాల్గొనే వీలుంటుందని ప్రిన్సిపాల్ స్పష్టీకరించారు.ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ ఎలగందుల సతీష్, 82394 77935, selagand@gitam.edu లేదా డాక్టర్ విన్యాస్ మాయాసా, 99491 23037, vmayasa@gitam.edu లను సంప్రదించాలని సూచించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…