Telangana

గీతంలో మాలిక్యులర్ డాకింగ్ పై కార్యశాల

ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీలో ‘మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్’పై ఒక రోజు ఆచరణాత్మక కార్యశాలను ఏప్రిల్ 11న నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేవారికి ప్రముఖ మాలిక్యులర్ మోడలింగ్ సాఫ్ట్ వేర్ అయిన మోల్ సాప్టును ఉపయోగించి కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో లోతైన అవగాహనను కల్పించడంతో పాటు ఆచరణాత్మక అనుభవాన్ని అందించడానికి రూపొందించినట్టు ఆయన తెలియజేశారు.మాలిక్యులర్ డాకింగ్ అండ్ వర్చువల్ స్ర్కీనింగ్ పరిచయం, డాకింగ్ మోడల్స్ యొక్క ఆఫ్టిమైజేషన్ అండ్ వాలిడేషన్, డ్రగ్ డిస్కవరీలో రియల్-వరల్డ్ కేస్ స్టడీస్ వంటి ముఖ్య అంశాలపై ఈ కార్యశాలలో తర్ఫీదు ఇస్తామన్నారు.పుణేలోని అడ్వెంట్ ఇన్ఫర్మేటిక్స్ లో అప్లికేషన్ సైంటిస్ట్ ఆదిత్య మిశ్రా ఈ కార్యశాలలో ప్రధాన శిక్షకుడిగా పాల్గొంటారని తెలిపారు. అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, కంప్యూటేషనల్ డ్రగ్ డిస్కవరీలో నిమగ్నమైన నిపుణుల కోసం దీనిని రూపొందించామని, కేవలం 30 మందికి మాత్రమే పాల్గొనే వీలుంటుందని ప్రిన్సిపాల్ స్పష్టీకరించారు.ఆసక్తి గలవారు ఏప్రిల్ 7వ తేదీలోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, రుసుము తదితర వివరాల కోసం డాక్టర్ ఎలగందుల సతీష్, 82394 77935, selagand@gitam.edu లేదా డాక్టర్ విన్యాస్ మాయాసా, 99491 23037, vmayasa@gitam.edu లను సంప్రదించాలని సూచించారు.

 

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

1 hour ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

1 hour ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

2 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago