Telangana

ఓయూలో గీతం అధ్యాపకుడి పుస్తకావిష్కరణ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జె.డి.ప్రభాకర్ పరిశోధనా పుస్తకం ‘భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ఆకృతి’ని ఆవిష్కరించినట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని భాషాశాస్త్ర విభాగం నిర్వహించిన ప్రతిష్టాత్మక 13వ అంతర్జాతీయ తెలుగు భాషాశాస్త్ర సదస్సులో, భారత భాషాశాస్త్ర పండితుల సంఘం పూర్వ అధ్యక్షుడు ప్రొఫెసర్ గారపాటి ఉమామహేశ్వరరావు, ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, భారతీయ భాషల కేంద్ర సంస్థ అధ్యక్షుడు మాధభూషి సంపత్ కుమార్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్టు తెలియజేశారు.జర్మనీలోని ప్రఖ్యాత ప్రచురణల సంస్థ లింకం GmbH యూరోపా ప్రచురించిన ఈ పుస్తకం అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఇటీవల హైడెల్ బర్గ్ విశ్వవిద్యాలయ గ్రంథాలయం, జర్మనీలోని పలు జాతీయ గ్రంథాలయాలో దీనిని ప్రతులను ఉంచినట్టు వివరించారు.భారతీయ భాషల సామాజిక-ఆర్థిక ప్రొఫైలింగ్, సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో భాష పోషించే కీలక పాత్రను ఈ పుస్తకం అన్వేషిస్తుందన్నారు. లోతైన పరిశోధన, గణాంక విశ్లేషణ ద్వారా, ఆధునిక సమాజాలలో ఆర్థిక వృద్ధికి భాష ఎలా కీలకమైన చోదకంగా పనిచేస్తుందో రచయిత వివరించినట్టు తెలిపారు. ఆర్థిక కార్యకలాపాలు, సంపద ఉత్పత్తిని మెరుగుపరచడానికి స్థానిక భాషలను పారిశ్రామిక రంగాలలో అనుసంధానించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, భాష, ఆర్థిక వ్యవస్థల మధ్య లోతైన సంబంధాన్ని ఈ అధ్యయనం ప్రస్ఫుటీకరించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

7 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago