Telangana

ఐక్యమత్యంగా సాగితేనే గుర్తింపు నీలం మధు ముదిరాజ్

ముదిరాజ్ ల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది

సబ్బండ వర్గాలు, మన జాతి అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా
నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనమంతా కలిసికట్టుగా ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే గుర్తింపు సాధ్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని మాతృశ్రీ గార్డెన్స్ లో ముదిరాజ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రాజకీయ చైతన్యం అలవర్చుకోవాలన్నారు. రాజకీయ చైతన్యంతోనే జాతి మనుగడ సాధ్యమని వివరించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ముదిరాజ్ ల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బీసీ కుల గణనతో ముదిరాజులకు మంచి రోజులు రానున్నాయని జోస్యం చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు.

ముదిరాజుల సుదీర్ఘ డిమాండ్ అయిన బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చే విషయంతో పాటు మత్స్యకార సంఘాలకు వడ్డీ లేని ఋణాలు, చేపల మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు మరికొన్ని అంశాలను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. దశలవారీగా మన హక్కులను సాధించుకుందామని అన్నారు. సబ్బండ వర్గాలు, ముదిరాజ్ జాతి అభివృద్ధికి శక్తివంచనా లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పెద్దలందరం కలిసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కార సాధనకు కృషి చేద్దామన్నారు.

ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్ల రాంగోపాల్, రాష్ట్ర ముదిరాజ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు జగన్మోహన్, మాజీ రాష్ట్ర ఫిషరీస్ చైర్మన్ పిట్టల రవీందర్, డీఎల్ పాండు, చేన్నవేని రాములు, సిరిసిల్ల జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు చొక్కాల రాములు, చొప్పరి రామచంద్రం, రెడ్డబోయిన గోపి, హనుమండ్లు, వెంకటస్వామి, ముత్యాల శ్రీనివాస్, దేవరాజు, పెద్ద సంఖ్యలో ముదిరాజ్ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

10 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

10 hours ago