Telangana

క‌నుల పండువ‌గా ఎల్ల‌కొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి బ్ర‌హోత్స‌వాలు

వికారాబాద్ ,మనవార్తలు ప్రతినిధి :

తెలంగాణ‌లోని వికారాబాద్ జిల్లా న‌వాబుపేట మండ‌లంలోని ఎల్లకొండ శ్రీ పార్వ‌తీ ప‌ర‌మేశ్వ‌ర స్వామి జాత‌ర బ్ర‌హ్మోత్స‌వాలు క‌నుల‌పండువ‌గా సాగుతున్నాయి. శివరాత్రి పండుగ రోజున ప్రారంభ‌మ‌యిన ఈ ఉత్స‌వాలు మార్చి 12 వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని ఆలయ ధర్మకర్త మండలి అధ్యక్షులు పళ్ళ భరత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ,ఏపీతో పాటు క‌ర్నాట‌క ,మ‌హారాష్ట్ర‌ల నుండి వ‌చ్చే భ‌క్తుల సౌక‌ర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు .మహాశివరాత్రి రోజున స్వామి వారి రుద్రాభిషేకములు, అమ్మవారికి అర్చనలు, ధ్వజారోహణము, అఖండ దీపారాధన, రాత్రికి జాగరణ, భజన కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు .అష్టమి స్వామివారికి, అమ్మవారికి నిత్యార్చనలు, విశేషపూజలు అందిస్తున్న‌ట్లు ఆల‌య క‌మిటీ తెలిపింది.

08-03-2025 శనివారం ,09-03-2025 ఆదివారం,10-03-2025 సోమవారం,11-03-2025 మంగళవారం,12-03-2025 బుధవారం సప్తమి స్వామివారికి అభిషేకములు శివ సహస్రనామార్చన, కుంకుమార్చన , శేషవాహనసేవలు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు .నవమి రోజు 4.00 గంట‌ల‌కు పల్లకిసేవ ఉద‌యం ఆరు గంట‌ల‌కు అగ్నిగుండ మ‌హోత్స‌వం ,ఉద‌యం 8 గంట‌ల‌కు అభిషేకం అమ్మవారికి విశేష అర్చన 11 గంట‌ల‌నుండి పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం నిర్వ‌హించ‌నున్నారు .దశమీ ఉద‌యం 8 గంట‌ల నుండి ప్రత్యేక అభిషేకములు, అర్చనలు సాయంత్రం ఆరు గంట‌ల‌కు కలశరోహణము తెల్లవారు ఝామున ఉద‌యం నాలుగు గంట‌ల‌కు ర‌థోత్స‌వం నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు .ద్వాదశి రోజున నిండు జాత‌ర , త్రయోదశి రోజున నాగవెల్లి నిర్వ‌హిస్తున్నామ‌ని భ‌క్తులు ఈ ఉత్స‌వ కార్య‌క్ర‌మాల్లో భ‌క్తి శ్ర‌ద్ద‌ల‌తో పాల్గొనాల‌న్నారు.బ్రహ్మోత్సవాల నిర్వహణలో తమ వంతుగా వస్తు రూపేణ సహాయ సహకారాలను అందించి శ్రీ పార్వతీ పరమేవశ్వరులను దర్శించి తరించి వారి కృపకు పాత్రులు కాగ‌ల‌ర‌ని ప్ర‌ధాన అర్చ‌కులు మ‌డుప‌తి నాగేశ్వ‌ర‌య్య స్వామి తెలిపారు .ఈ కార్య‌క్ర‌మంలో గ్రామ ప్ర‌జ‌లు భాగ‌స్వామ్యం కావాల‌ని పిలుపునిచ్చారు .

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago