Telangana

ఆహారం విభజిస్తుంది, ఏకం చేస్తుంది

ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న న్యూఢిల్లీలోని జేఎన్ యూ ప్రొఫెసర్ మహాలక్ష్మి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ఆహారం కేవలం జీవనోపాధి కంటే చాలా ఎక్కువ అని, అది మధ్యవర్తిత్వం చేస్తుంది, విభజిస్తుంది, ఏకం చేస్తుంది, సహజీవనాన్ని అనుమతిస్తుందని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలోని చరిత్ర అధ్యయన కేంద్రం ప్రొఫెసర్ ఆర్. మహాలక్ష్మి పేర్కొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో ‘అన్నం బ్రహ్మోపస్థే’ అనే అంశంపై సోమవారం ఆమె ఆతిథ్య ఉపన్యాసం చేశారు.డాక్టర్ మహాలక్ష్మి ఉపన్యాసం ఆహారం యొక్క అందమైన చరిత్రను లోతుగా పరిశీలించడమే గాక, అంతరాలు, లింగం, సామాజిక-సాంస్కృతిక గతిశీలతతో సింహావలోకం చేసింది. తమిళం, సంస్కృతం, పాళీ భాషల మూలాల నుంచి సేకరించిన ఆధారాల ద్వారా, ఆహారాన్ని ఎలా సేకరిస్తారు, ఎవరికి అందుబాటులో ఉంటుంది, అది సంస్కృతి, గుర్తింపునకు రూపొందించే లోతైన మార్గాలను పరిశీలించింది.

వంటకాలలో ప్రాంతీయ వైవిధ్యాలు, కొనసాగింపు.. రెండింటినీ ప్రతిబింబిస్తాయని, విభిన్నమైన తయారీ, వినియోగం శైలులు కాలక్రమేణా అభివృద్ధి చెందుతాయని ప్రొఫెసర్ మహాలక్ష్మి పేర్కొన్నారు. ఆహార సంప్రదాయాలు స్థిరమైనవి, మారవు అనే భావనకు విరుద్ధంగా, భారత ఉపఖండం లోపల, వెలుపల బాహ్య పరస్పర చర్యల ద్వారా పాక శాస్త్ర పద్ధతులు నిరంతరం ఎలా ప్రభావితమవుతాయో ఆమె వివరించారు.ఆహారం యొక్క లోతైన సంకేత, తాత్విక కోణాలను ప్రొఫెసర్ మహాలక్ష్మి ప్రస్తావిస్తూ, సంక్లిష్టమైన తాత్విక ఆలోచనలకు ఆహారాన్ని ఎలా సారూప్యంగా ఉపయోగించారో వివరించడానికి ఆమె వేదాలు, ఉపనిషత్తులు, నాట్యశాస్త్రం వంటి గ్రంథాలను ప్రస్తావించారు. భరతముని నాట్యశాస్త్రాన్ని ఉటంకిస్తూ, రుచి అనేది కేవలం ఇంద్రియ అనుభవం మాత్రమే కాదు, భావోద్వేగాలు, అర్థాల యొక్క సూక్ష్మమైన పరస్పర చర్య అని ఆమె సూత్రీకరించారు.

మానసోల్లాస, యాజ్జవల్క్య స్మృతి వంటి గ్రంథాలను ఉటంకిస్తూ, ప్రొఫెసర్ మహాలక్ష్మి పురాతన భారతీయ వంటకాలు, ఆచార ఆహార పద్ధతులపై లోతైన అవగాహన కల్పించారు. వివిధ మాంసాలతో వండిన బియ్యం, ఆహార తయారీకి లోతైన ఆచార ప్రాముఖ్యత కలిగిన అశ్వమేధ వంటి ఆచారాలను ఆమె వివరించారు.ఆహారం యొక్క అభివృద్ధి చెందుతున్న అవగాహనలను, ముఖ్యంగా ఆధునిక యుగంలో, ఆహారం విరివిగా లభించడం, పెరుగుతున్న అసమానతలు, వినియోగ పద్ధతుల చుట్టూ ఉన్న సంఘర్షణలతో కలిసి ఉంటుందని ప్రొఫెసర్ మహాలక్ష్మి తన ముగింపు వ్యాఖ్యలలో పేర్కొన్నారు. చరిత్రకారులుగా, గతాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే కాకుండా, వర్తమానం, భవిష్యత్తు గురించిన కథనాలను రూపొందించడానికి కూడా ఆహార చరిత్ర యొక్క విభిన్న కథనాలను ముందుకు తీసుకురావడం అత్యవసరమని ప్రొఫెసర్ మహాలక్ష్మి నొక్కి చెప్పారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago