తిరుమల:
సామాన్య భక్తులకు సైతం కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి దర్శనభాగ్యం కల్పించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సర్వదర్శనం టికెట్ల కోటాను పునరుద్ధరించగా.. ఇటీవల ఆన్లైన్లో అక్టోబర్ నెలకు సంబంధించిన కోటాను విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు భక్తులు టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం పలు సూచనలు చేసింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
కొవిడ్ వ్యాప్తి నివారణలో భాగంగా భక్తులు, ఉద్యోగుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదంటే.. దర్శనానికి 72 గంటల ముందు చేసుకున్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్ను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పలువురు భక్తులకు దర్శనం టికెట్లు లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి దర్శనం టోకెన్లు, టికెట్లు లేని భక్తులను వెనక్కి పంపుతున్నారు. ఈ క్రమంలో భక్తులు గమనించి, సహకరించాలని టీటీడీ కోరింది.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…