Hyderabad

అకౌంటింగ్లో ఆధునిక ధోరణులపై గీతమ్ జాతీయ సదస్సు…

హెదరాబాద్

ఇండియన్ బ్యాంక్ సౌజన్యంతో , గీతం హెదరాబాద్ బిజినెస్ స్కూల్ ( జీహెచీబీఎస్ ) ‘ అకౌంటింగ్లో ఆధునిక ధోరణులు ‘ అనే అంశంపై ఒకరోజు జాతీయ ఈ సదస్సును ఈనెల 29 న నిర్వహించనున్నట్టు సమన్వయకర్త జీఆర్కై ప్రసాద్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు . భవిష్యత్తు అకౌంటింగ్ ప్రక్రియలు , అధునాతన మార్పులను స్వీకరించడానికి అకౌంటింగ్ నిపుణులు తమను తాము సిద్ధం చేసుకోవడానికి ఈ సదస్సు ఉపకరిస్తుందన్నారు . అకౌంటింగ్లో కృత్రిమ మేథ , క్లౌడ్ అకౌంటింగ్ , అకౌటింగ్ ప్రాసెస్ ఆటోమేషన్ , అకౌంటింగ్ అనలిటిక్స్ , అకౌంటింగ్ లో బిగ్ డేటా వంటి తాజా ధోరణులపై చర్చించనున్నట్టు ఆయన తెలియజేశారు . ప్రముఖ వక్తలతో నిర్వహించే ప్యానెల్ చర్చలు , వర్క్షాప్లు ఈ సదస్సులో పాల్గొనేవారికి ఎంతో ఉపకరిస్తాయన్నారు . అకౌంటింగ్లో చోటుచేసుకుంటున్న ఆధునిక ధోరణులు , వాటిని అర్థం చేసుకోవడం , వీటిలో బీ – స్కూల్స్ పాత్ర వంటి లక్ష్యాలతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు ప్రసాద్ పేర్కొన్నారు . చెన్నయ్లోని ఐసీఏఐ చెర్మన్ ఎస్.పాపారావు , రాష్ట్రీయ ఇస్పాత్ నిగం పూర్వ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) టీవీఎస్ కృ కుమార్ , ఎఫ్ఏసీటీ డెరైక్టర్ ( ఫైనాన్స్ ) ఎస్.శక్తిముని , టాటాస్టీల్ ఏజీఎం అరుణ్ కుమార్ పాటి తదితరులు ఈ సద్సులో ప్రముఖ వక్తలుగా పాల్గొనన్నుట్టు ఆయన తెలిపారు . పేర్ల నమోదు , ఇతరత్రా సమాచారం కోసం డాక్టర్ చంద్రభాను దాస్ ( 99380 78219 ) cdas@gitam.edu ను సంప్రదించాలని సమన్వయకర్త సూచించారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago