Districts

అక్టోబర్ 31న జరగబోయే మాలమహానాడు ప్లీనరీ మహాసభను విజయవంతం చేయండి

కరపత్రాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్

ఖమ్మం :

అక్టోబర్ ముప్పై ఒకటి న హైదరాబాద్లో నిర్వహించే మాలమహానాడు జాతీయ ప్లీనరీ సభను విజయవంతం చేయాలని కోరుతూ సంబంధించిన పాంప్లెట్ను నగరంలో అంబేద్కర్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జిల్లా అధ్యక్షులు కందుల ఉపేందర్ అధ్యక్షతన ముఖ్య అతిథిగా తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పాల్గొని ఆవిష్కరించి మాట్లాడారు . దళితుల సమగ్రాభివృద్ధికి , సాధికారత ఐక్యత లక్ష్యంగా ఈ ప్లీనరీ సభను నిర్వహించామని , రాజ్యాంగానికి వ్యతిరేకమైన ఎస్సీ వర్గీకరణకు ఏ పార్టీ మద్దతు తెలిపిన మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు .

వర్గీకరణ పేరుతో దళితులను విభజించి కోవడం అంబేద్కర్ ఆలోచనా విధానం కాదని కేవలం దళితులను ఓటు బ్యాంకుగా కాకుండా ఐక్యత కుడా చూడాలని కోరారు .అలాగే రైతుల మరణాలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదని పేర్కొన్నారు . జరగబోయే మాలమహానాడు ప్లీనరీ సభకు భారీగా మాలలంతా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు .

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి యేర్పుల జానయ్య , జిల్లా వర్కింగ్ ప్రసిడెంట్ గడ్డి కొప్పుల ఆనందరావు , జిల్లా ప్రధాన కార్యదర్శి ఉండేటి శ్రీనివాసరావు ,రూరల్ మండలం అధ్యక్షులు రేoటాలో శ్రీరాములు , చిoతల రవి , కందుల ఎల్లరాజు , కందుల ప్రదీప్ , కొత్త పల్లి కేశవరావు తదితరులు పాల్గొన్నారు .

Ramesh

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago