politics

విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించాలి ఏఐటీయూసీ

కనీస వేతనం అమలు చేయాలనీ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి :

విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఉద్యోగ భద్రత కల్పించి, కనీస వేతనాన్ని అమలు చేయాలని కోరుతూ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు .ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్ మునేప్ప మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు వస్తే మీటర్ రీడర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న మీటర్ రీడర్లకు ప్రత్యన్న ఉపాధి చూపించడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యుత్ మీటర్ రీడర్స్ కు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ లో ఐటిఐ అర్హత ఉన్న వారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను అలాగే వాచ్ అండ్ వార్డ్ గా నియమించాలనీ నూతనంగా ఏర్పడిన సర్కిల్ ఆఫీసులో అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్ గాను, అటెండర్స్ గా, వాచ్మెన్ గాను నియమించాలి. 12 రోజులు రీడింగ్ అనంతరం మీటర్ రీడర్లను డిలిస్టులకు మీటర్లు మార్చడంలో ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం ఏడిఈ నాగేంద్ర ప్రసాద్ గారు వినతిపత్రం ఇవ్వడం అందించారు .ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ల రీడింగ్ యూనియన్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు వీరేష్, వీర శేఖర్, ఉరుకుందు,ఏఐటీయూసీ తాలూకా కార్యదర్శి తిమ్మగురుడు, పట్టణ కార్యదర్శి విజేంద్ర, కుమార్ స్వామి, నరసప్ప, చంద్రశేఖర్, నరసింహులు, జోష్ రాజ్, ఉప్పర ఉరుకుందు, కిరణ్ కుమార్, రంగన్న, మునిస్వామి, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago