Telangana

గీతంకు నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ గ్రాంటు

ప్రవాహ అస్థిరతలను అధ్యయనం చేయనున్న గీతం సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెజా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదుకు మరో ప్రతిష్ఠాత్మక పరిశోధనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సంస్థ మంజూరు చేసింది. భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్టీ)లోని అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఏఎన్ఆర్ఎఫ్) గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ మోతాహర్ రెజాకు ప్రతిష్టాత్మక పరిశోధనా ప్రాజెక్టును మంజూరు చేసినట్టు మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.తిరిగే వక్ర మైక్రో పైపులలో ప్రవాహ అస్థిరతల అధ్యయనం’ పేరిట చేపట్టే ఈ ప్రాజెక్టు, అధునాతన సంఖ్యా, విశ్లేషణాత్మక పద్ధతులను ఉపయోగించి మైక్రోడొమైన్ లలో ద్రవ ప్రవాహ ప్రవర్తనను మూడేళ్ల కాల పరిమితితో పరిశోధించడానికి ఉద్దేశించినదని తెలిపారు. మైక్రోఫ్లూయిడిక్స్, సంబంధిత రంగాలలో కీలకమైన అనువర్తనాలను కలిగి ఉన్న ప్రవాహ అస్థిరతలపై చేపట్టే ఈ పరిశోధన, దీనిపై లోతైన అవగాహనను అందిస్తుందని అభిలషిస్తున్నామన్నారు.ఈ పరిశోధనలో డాక్టర్ రెజాకు సహాయకారికి ఉండేందుకు జూనియర్ రీసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్) అవసరమని తెలిపారు. ఎంటెక్ లేదా ఎమ్మెస్సీ (గణితం) ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై, గేట్ లేదా నెట్ అర్హతతో పాటు మ్యాట్ ల్యాబ్ ప్రోగ్రామింగ్ లో ప్రావీణ్యం ఉన్న 32 ఏళ్ల వయస్సు లోపు వారు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు, మహిళలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది) దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. జేఆర్ఎఫ్ గా ఎన్నికైన వారికి నెలవారీ రూ.37 వేల భత్యంతో పాటు ఇంటి అద్దె అలవెన్సు కూడా ఇస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డాక్టర్ రెజా 78730 49059ను సంప్రదించాలని, లేదా mreza@gitam.edu or motaharreza90@gmail.com కు ఈ-మెయిల్ దరఖాస్తు చేయాలని సూచించారు.ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సాధించిన డాక్టర్ రెజాను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలువురు డైరెక్టర్లు, విభాగాధిపతులు అభినందించి, నిర్ణీత కాల వ్యవధిలోగా దీనిని విజయవంతంగా పూర్తిచేయమని ప్రోత్సహించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు, శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో గీతం నిబద్ధతను తేటతెల్లం చేస్తోందన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

45 minutes ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

52 minutes ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

1 hour ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago