Districts

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…

ధాన్యం ఎండబెట్టిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి…
– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు

పటాన్ చెరు:

రైతులు ధాన్యం అమ్మడానికి తీసుకొని వచ్చే ముందు ఎండబెట్టి తేమశాతం 17 వచ్చిన తర్వాతనే కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నరసింహారావు అన్నారు. సోమవారం పటాన్ చెరు మండల పరిధిలోని లక్డారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ రైతులు వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా తేమ శాతం పరీక్ష చేయించుకొని టోకెన్ ఇచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రానికి దాన్యం తీసుకొని రావాలని అన్నారు. వర్ష సూచన ఉన్నట్లయితే పంట కోతను తదనుగుణంగా వాయిదా వేయాలి, కోసినట్లయితే పంటను టార్పాలిన్ పట్టాలతో కప్పి ఉంచాలన్నారు. రాబోయే వర్షాకాలంలో దృష్ట్యా రైతులు నాణ్యమైన విత్తనాలు మాత్రమే లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద కొనుగోలు చేయాలని సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్మినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎడిఎ బి.జె సురేష్ బాబు, ఎంఏఓ ఉష, ఏఈఓ దేవిసింగ్, కొనుగోలు కేంద్రం ఇంచార్జి రాజు, రైతులు పాల్గొన్నారు.

Venu

Recent Posts

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

1 day ago

నాణ్యమైన మౌలిక సదుపాయాలకు వెన్నెముకగా మెట్రాలజీ

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…

1 day ago

* భారతదేశంలోనే తొలి ‘సింగిల్-డే ఫేషియల్ ఆర్కిటెక్చర్’ సెంటర్

ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వి‌కేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…

2 days ago

గీతంలో సంక్రాంతి సంబరాలు

సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…

2 days ago

సీనియర్ సిటిజన్స్‌కు ఎల్లప్పుడూ అండగా ఉంటాం కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి

భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…

3 days ago

కాంగ్రెస్ శ్రేణుల సమిష్టి కృషితోనే కాంగ్రెస్ అభ్యర్థుల విజయం : నీలం మధు ముదిరాజ్..

కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…

3 days ago