వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం:
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలలో భక్తి భావం పెంపొందించేలా నూతన ఆలయాలు నిర్మించడం హర్షించదగ్గ విషయం అన్నారు. పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా సొంత నిధులతో 200లపైగా దేవాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. జీవనజ్యోతి జ్యోతిర్లింగం దేవాలయానికి గతంలోనే 16 లక్షల రూపాయల విరాళం అందించడం జరిగిందని.భవిష్యత్తులోనూ సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దేవాలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శివ భక్తుల విజ్ఞప్తి మేరకు ఆలయం పరిధిలో సన్నిధానం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…