మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం లక్డారం గ్రామంలో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపు ఓటములు అత్యంత సహజమని అంతిమంగా గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. అతి త్వరలోనే గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో పార్టీ పట్టిష్టతకు ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో కార్యకర్తలకు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన ఇస్నాపూర్ మున్సిపల్ పాలకమండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పటాన్చెరు మాజీ జెడ్పిటిసి శ్రీకాంత్ గౌడ్, ఇస్నాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మోటె సుమలత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు శంకర్ గౌడ్, రాములు గౌడ్, మోటె కృష్ణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…