Telangana

విద్యార్థుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులు రామాంజనేయులు

మనవార్తలు ప్రతినిధి, నారాయణపేట్ :

సామాజిక సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని లయన్స్ క్లబ్ సభ్యులు రామాంజనేయులు తెలిపారు. విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్న దృఢ నమ్మకంతో తాము పాఠశాలల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.నారాయణపేట్ జిల్లా ఎస్.కొల్లంపల్లి మండలంలోని ప్రజా పరిషత్ పాఠశాలలో రామాంజనేయులు తన జన్మదిన వేడుకలను విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలకు అవసరమైన మైక్ సెట్, గోడ గడియారాన్ని విరాళంగా అందజేశారు. వీటివల్ల పాఠశాల దైనందిన కార్యకలాపాలు మరింత సౌకర్యవంతంగా సాగుతాయని తెలిపారు.లయన్స్ క్లబ్ ద్వారా ఎంపీపీ పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని రామాంజనేయులు హామీ ఇచ్చారు. పాఠశాలల అభివృద్ధితో పాటు విద్యార్థుల సౌకర్యాలు, అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాల వివరాలను ఆయన వివరించారు.

అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు అంజయ్య విద్యార్థుల అవసరాల నిమిత్తం రూ.1,100 నగదు విరాళాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని పాఠశాల అవసరాలకు వినియోగిస్తామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనంతరం లయన్స్ క్లబ్ సభ్యులు తీసుకువచ్చిన కేక్‌ను విద్యార్థుల సమక్షంలో కట్ చేసి రామాంజనేయులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు కూడా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడంతో కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.లయన్స్ క్లబ్ గవర్నర్ డాక్టర్ జి. మహేందర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు కోనా వెంకటేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్యాభివృద్ధే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. కార్యదర్శి మహేష్ గౌడ్ మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు కృపాకర్ రెడ్డి, సత్యనారాయణ, నాగరాజు, గ్రామ ఉపసర్పంచ్, ఏఏపీసీ ఛైర్మన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో ఎస్.వి.నూకరాజుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: దీర్ఘకాలిక వాపు సంబంధిత వ్యాధుల చికిత్స కోసం పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదు లోని గీతం స్కూల్…

2 days ago

పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి : నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆపత్కాలంలో పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక సంజీవనిలా మారిందని, నిరుపేదల ఆరోగ్య భద్రతకు…

3 days ago

గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ

ఎం.ఫార్మ్. కోర్సు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని…

3 days ago