Telangana

గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడమే సీఎం కప్ లక్ష్యం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో గల పాఠశాలల స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా సీఎం కప్ క్రీడోత్సవాలు నిర్వహిస్తోందని పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలో విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు.బుధవారం పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ 2025-2026 పటాన్‌చెరు నియోజకవర్గస్థాయి క్రీడలను క్రీడాజ్యోతి వెలిగించి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతహాగా క్రీడాకారుడైన తాను క్రీడల అభివృద్ధికి అనునిత్యం అండగా నిలుస్తూ వారు అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నానని తెలిపారు. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం వివిధ క్రీడా అంశాలలో మైత్రి మైదానం వేదికగా జిల్లా, రాష్ట్రస్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని తెలిపారు.. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల స్థాయి క్రీడల్లో ఎంపికైన 400 మంది విద్యార్థులు నియోజకవర్గస్థాయి క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు సిఐ వినాయక రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల విద్యాశాఖ అధికారులు నాగేశ్వరరావు నాయక్, రాములు, సుధాకర్, విజయ్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago