Telangana

నాలుగు లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి ఉరి తాళ్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే మల్లికార్జున్

లేబర్ కోడ్స్ తక్షణమే రద్దు చేయాలి

కార్మిక సంఘాలపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి

ఫిబ్రవరి 12 సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం ఐక్యంగా కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెతో కార్మిక వర్గం కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కార్మిక వర్గానికి ఉరి తాళ్లు అయిన లేబర్ కోడ్స్ ను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె మల్లికార్జున్ పేర్కొన్నారు. పటాన్ చెరు లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని జరిగిన సదస్సుకు మల్లికార్జున్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మికులను బానిసలుగా మార్చే 4 లేబర్ కోడ్స్ తెచ్చిందని అన్నారు వాటితో కార్మిక వర్గానికి తీవ్రం నష్టమని అన్నారు తక్షణమే లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మిక సంఘాల పట్ల చులకన చూడడం కార్మిక సంఘాలు అభివృద్ధికి ఆటంకంగా మారాయి అనడం సరికాదని అన్నారు. కార్మికుల కర్షకుల శ్రమ లేనిదే సంపద అభివృద్ధి లేదని అన్నారు. లేబర్ కోడ్స్ తో కార్మికుల హక్కుల మీద తీవ్రమైన దాడి జరుగుతుందని అన్నారు. 29 కార్మిక చట్టాలు ఉన్నప్పుడే వాటిని అమలు చేయకుండా కార్మికులను యాజమాన్యాలు తీవ్రమైన శ్రమదోపిడికి పాల్పడ్డాయని అన్నారు. లేబర్ కోడ్స్ తో మరింత శ్రమ దోపిడిని యాజమాన్యాలు పాల్పడడానికి అవకాశం దొరికిందన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు కార్మికులతో పాటు రైతు కూలీ ఉద్యోగులకు వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఆరోపించారు. లేబర్ కోడ్స్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్నారు అందులో భాగంగా ఫిబ్రవరి 12 దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జాతీయ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయన్నారు పటాన్ చెరు ప్రాంతంలో కూడా కార్మికుల పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి కే రాజయ్య జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మానిక్,పి పాండురంగారెడ్డి, బి నాగేశ్వరరావు సిఐటియు సీనియర్ నాయకులు వాజిద్ అలీ , వివిధ పరిశ్రమల సిఐటియు యూనియన్ నాయకులు విఎస్ రాజు, మణిరాజ్, రామకృష్ణ, శ్రీనివాస్ గౌడ్, జయరాం, సుధాకర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago