Telangana

ఫార్మాస్యూటికల్ పరిశోధనలో డాక్టర్ ఆంజనేయులుకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ఫార్మాస్యూటికల్ పరిశోధనను విజయవంతంగా పూర్తిచేసిన హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ పరిశోధక విద్యార్థి పాటంశెట్టి ఆంజనేయులును డాక్టరేట్ వరించింది. ‘ఎంచుకున్న ఔషధాల (ఇరినోటెకాన్, సునిటినిబ్) మెరుగైన క్యాన్సర్ నిరోధక సామర్థ్యం కోసం అల్ట్రాసౌండ్-ఆధారిత నానోబబుల్ ఔషధ పంపిణీకి మార్గదర్శనం’ అనే అంశంపై ఆయన అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.కొలొరెక్టర్ క్యాన్సర్ చికిత్సలో వైద్యపరంగా ఆమోదించబడిన క్యాన్సర్ నిరోధక మందులు, ఇరినోటెకాన్, సునిటినిబ్ ల చికిత్సా సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి డెక్ర్స్టాన్-ఆధారిత, అల్ట్రాసౌండ్-ప్రతిస్పందించే నానోబబుళ్లను అభివృద్ధి చేయడంపై డాక్టర్ ఆంజనేయులు పరిశోధన దృష్టి సారించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం గణనీయంగా మెరుగైన ఔషధ విడుదల, జీవ లభ్యత, క్యాన్సర్ నిరోధక కార్యకలాపాలను, తగ్గిన దైహిక విషప్రక్రియను ప్రదర్శించిందన్నారు.ఈ పరిశోధన ఫలితాలు నానోబబుల్-సహాయ ఔషధ పంపిణీని లక్ష్య, ఉద్దీపనలకు ప్రతిస్పందించే క్యాన్సర్ చికిత్సకు ఒక ఆశాజనక వేదికగా నిర్ధారిస్తాయని, భవిష్యత్తులో క్లినికల్ అనువాదానికి బలమైన సామర్థ్యాన్ని అందిస్తాయని వివరించారు.డాక్టర్ ఆంజనేయులు సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, పలు విభాగాల అధిపతులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago