కోవిడ్ పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్..
పటాన్ చెరు:
గ్రామ పంచాయతీ స్థాయిలో ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం హర్షనీయమని జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత కోవిడ్ పరీక్షా కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ పరిధిలో ఎవరికైనా జ్వరం, కరోనా లక్షణాలు ఉంటే ఉచిత పరీక్ష కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఉపేందర్, ఎంపిడిఓ బన్సిలాల్, ఎం పీ ఓ రాజు, ఎంపీటీసీ కుమార్ గౌడ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషోర్ యాదవ్, వార్డు సభ్యులు, వైద్య సిబ్బంది గీత, తదితరులు పాల్గొన్నారు.
తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: పటాన్చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…
పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…
ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…
అమీన్పూర్లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…