Telangana

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం

8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే ప్రత్యేక మోటివేషన్ క్లాసులు పరీక్షా సామాగ్రి పంపిణీ 

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:

ప్రతి విద్యార్థి జీవితంలో 10వ తరగతి పరీక్షలు అత్యంత కీలకమని, ఇష్టపడి చదివి  అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు సూచించారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటాన్‌చెరు  జెపి కాలనీ డివిజన్లతో పాటు ఇస్నాపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశం మున్సిపాలిటీ, పటాన్‌చెరు మండల పరిధిలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతి విద్యనభ్యసిస్తున్న 3000 వేల మంది విద్యార్థినీ విద్యార్థులకు తన సొంత నిధులతో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస ప్రేరణ తరగతులను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన పదవ తరగతి పరీక్ష సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి అన్న అంశంపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు చంద్రయ్యచే ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పరీక్షలు పూర్తయ్యే వరకు ఇంట్లో ఫోన్లు, టీవీలకు పిల్లలను దూరంగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం సొంత నిధులచే కొనుగోలు చేసిన పరీక్ష మెటీరియల్ విద్యార్థులకు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి నాగేశ్వర రావు నాయక్, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల హెడ్ మాస్టర్లు, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago