_ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు
మనవార్తలు ,కర్నూలు:
స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా 75 స్వాతంత్ర దినోత్సవాలను పూర్తిచేసుకుని 76వ సంవత్సరంలోని వెళ్తున్న సందర్భంగా కర్నూలులోని యువకులు డి.నిఖిల్ గౌడ్ నేతృత్వంలో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కర్నూలు డిఎస్పి కె.వి.మహేష్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అహింసా మార్గంలో సాధించిన భారత స్వాతంత్రాన్ని నేడు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, అమరవీరుల త్యాగాన్ని నేటి యువకులు స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందించదగిన విషయమని తెలిపారు. నేటి తరాలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. జాతీయ పతాక ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలు పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలలు ,విద్యార్థులు యువజన సంఘాల యువకులు, ప్రజా నాయకులు సంయుక్తంగా ఈ ర్యాలీలో పాల్గొని 555 అడుగులత్రివర్ణ పథకాన్ని కర్నూలు జిల్లా పరిషత్ గాంధీ విగ్రహ ఆవరణము నుండి కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజవంతం చేసిన ప్రతి ఒక్కరికి డి.నిఖిల్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…