_ఉప్పొంగిన జాతీయ భావం.. మహనీయుల త్యాగాలను స్మరిస్తూ నినాదాలు
మనవార్తలు ,కర్నూలు:
స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల్లో భాగంగా 75 స్వాతంత్ర దినోత్సవాలను పూర్తిచేసుకుని 76వ సంవత్సరంలోని వెళ్తున్న సందర్భంగా కర్నూలులోని యువకులు డి.నిఖిల్ గౌడ్ నేతృత్వంలో 555 అడుగుల భారీ త్రివర్ణ పతాకాన్ని కర్నూలు డిఎస్పి కె.వి.మహేష్ భారీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధులు అహింసా మార్గంలో సాధించిన భారత స్వాతంత్రాన్ని నేడు మనం స్వేచ్ఛగా అనుభవిస్తున్నామని, అమరవీరుల త్యాగాన్ని నేటి యువకులు స్మరించుకుంటూ ఇలాంటి కార్యక్రమం చేయడం అభినందించదగిన విషయమని తెలిపారు. నేటి తరాలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు. జాతీయ పతాక ర్యాలీలో పాల్గొన్న వేలాది మంది విద్యార్థులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కర్నూలు పట్టణంలోని వివిధ కళాశాలల పాఠశాలలు ,విద్యార్థులు యువజన సంఘాల యువకులు, ప్రజా నాయకులు సంయుక్తంగా ఈ ర్యాలీలో పాల్గొని 555 అడుగులత్రివర్ణ పథకాన్ని కర్నూలు జిల్లా పరిషత్ గాంధీ విగ్రహ ఆవరణము నుండి కొండారెడ్డి బురుజు వరకు ప్రదర్శించారు.ఈ కార్యక్రమంలో పాల్గొని విజవంతం చేసిన ప్రతి ఒక్కరికి డి.నిఖిల్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…