Telangana

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్

తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ వాటర్ పరిశ్రమ ముందు కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ కార్మికులు యూనియన్ పెట్టుకుంటే తొలగించడం చట్టానికి వ్యతిరేకమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులను సైతం యాజమాన్యం భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో యాజమాన్యం కోట్లు గడిస్తు, కార్మికుల భద్రత సంక్షేమం గాలికి వదిలేయడం దారుణమన్నారు.కార్మికులు హక్కులు రక్షణ కోసం కార్మికులు ఏకం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యజమాన్యం దిగివచ్చి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నాగరాజు, కోశాధికారి నవీన్, సిఐటియు నాయకులు రాజు,వెంకటేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago