Telangana

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్

తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

కండ్లకు నల్ల రిబ్బను కట్టుకొని వినూత్న నిరసన

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ వాటర్ పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడ లో గల బిస్లరీ వాటర్ పరిశ్రమ ముందు కార్మికులు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా అతిమేల మాణిక్ మాట్లాడుతూ కార్మికులు యూనియన్ పెట్టుకుంటే తొలగించడం చట్టానికి వ్యతిరేకమన్నారు. తొలగించిన కార్మికులను వెంటనే విధులకు తీసుకోవాలని శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న కార్మికులను సైతం యాజమాన్యం భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపించారు. కోట్ల రూపాయలు లాభాలు గడిస్తున్న యాజమాన్యం కు కార్మికులు యూనియన్ పెట్టుకుంటే ఏం ఇబ్బంది ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికుల శ్రమతో యాజమాన్యం కోట్లు గడిస్తు, కార్మికుల భద్రత సంక్షేమం గాలికి వదిలేయడం దారుణమన్నారు.కార్మికులు హక్కులు రక్షణ కోసం కార్మికులు ఏకం కావడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఇప్పటికైనా యజమాన్యం దిగివచ్చి తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవడంతోపాటు సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని లేని పక్షంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా యజమాన్యాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిస్లరీ ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రెటరీ శేఖర్ రెడ్డి,గౌరవ అధ్యక్షులు నాగరాజు, కోశాధికారి నవీన్, సిఐటియు నాయకులు రాజు,వెంకటేష్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago