మనవార్తలు ,పటాన్ చెరు:
జాతీయ భావాన్ని ఉప్పొంగేలా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెరాస రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ అన్నారు .సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండల చిట్కుల్ గ్రామ పరిధిలో 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకులను పురస్కరించుకుని 50 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని తెరాస రాష్ట్ర నాయకులు,చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఆర్చరీ, స్కేటింగ్ క్రీడాకారిణి బంగారు పతకం విజేత శాన్వి చేతుల మీదుగా ఆవిష్కరించారు. స్వాతంత్రం సాధించి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో జరుపుకుంటున్న వజ్రోత్సవ వేడుకల్లో పాలుపంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు.
మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎంతో అభివృద్ధి చేశారని ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని ఇవి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని తెలిపారు.చిట్కుల్ గ్రామ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా గ్రామ కార్యవర్గం గ్రామస్తులు ఇతర అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్య క్రమంలో ఈవో కవిత ,ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి,ఎంపీటీసీలు మంజుల,మాధవి,వార్డు సభ్యులు దుర్గయ్య,లక్ష్మి, వెంకటేష్,గౌరీ,భుజంగం, మురళి,వెంకటేష్,రాజకుమార్, ఆంజనేయులు, రైతు సంఘం అధ్యక్షుడు వి నారాయణ రెడ్డి, చాకలి వెంకటేశ్,గోపాల్,అనిల్,వెంకటేశ్, గ్రామ పెద్దలు,ప్రజలు, యువజన సంఘాలు,విద్యార్థులు,ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ముత్తంగి రింగ్రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…