Telangana

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై దాడి ఖండించిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ,ప‌టాన్ చెరు:

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ పై జ‌రిగిన దాడిని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న ఆద‌ర‌ణ త‌ట్టుకోలేకే టీఆర్ఎస్ నేత‌లు దాడుల‌కు పాల్ప‌డుతున్నార‌ని విమ‌ర్శించారు . జ‌నగాంలో జిల్లా దేవరుప్పుల లో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో టిఆర్ఎస్ గుండాలు బిజెపి నాయకులు కార్యకర్తలపై చేసిన రాళ్ల దాడికి నిరసనగా పటాన్చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ చౌరస్తాలో ఎర్రబెల్లి దయాకర్ రావు దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు . స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా కూడా బడుగు బలహీన వర్గాల పై టిఆర్ఎస్ దొరల అహంకారం అణచివేతకు నిదర్శనం ఈ రాళ్ల దాడి అని ఆయన మండిపడ్డారు. బండి సంజయ్, బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డిన వారిని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు . బిజెపి నాయకుల పై కార్యకర్తల పై రాళ్ల దాడి చేసి వారి వాహనాలను ధ్వంసం చేయ‌డం సిగ్గుచేట‌ని తెలిపారు . భవిష్యత్తులో ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని దాడికి ప్రతిదాడి తప్పదని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పటాన్ చేరు బిజెపి మండల అధ్యక్షుడు ఎల్వర్తి ఈశ్వరయ్య, బిజెపి సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి, ఇస్నాపూర్ వార్డు సభ్యులు నారాయణదాసు, బిజెపి మహిళా నాయకురాలు గడ్డ పుణ్యవతి, మండల బిజెపి ఉపాధ్యక్షుడు సాయి కుమార్,బిజేవైయం మండల ప్రధాన కార్యదర్శి దిపక్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు జోగు ధన్ రాజ్ మరియు యస్.ఆర్.కే యువసేన సభ్యులు కిశోర్ రెడ్డి,సర్వోత్తం రెడ్డి, రాజ్ గోపాల్, విజయ్,శకిల్, దుర్గా సాయి, రాము, మల్కాపురం సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

యువ సంగ్రామ సదస్సు”కు కేసీఆర్ నగర్ నుంచి కదిలిన బీఆర్ఎస్ శ్రేణులు

మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…

4 hours ago

పటాన్‌చెరు గడ్డపై గులాబీ జెండా హోరు

దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే  యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు  ఎమ్మెల్యే జిఎంఆర్…

4 hours ago

పటాన్‌చెరులో ఘనంగా పూరి జగన్నాథుడి రథయాత్ర

మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…

4 hours ago

గోమాఫియా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలి విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ మధురనేని సుభాష్ చంద్ర

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…

2 days ago

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…

2 days ago

తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలి సిఐటియు రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు అతిమేల మానిక్

చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…

2 days ago