Districts

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద‌పీట‌ వేస్తున్న వైసీపీ ప్రభుత్వం:ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని

అడ‌గ‌కుండానే జ‌గ‌న‌న్న వ‌రాలు
నాదెండ్ల‌లో ఘ‌నంగా వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభం

గుంటూరు జిల్లా

మ‌హిళాభ్యున్న‌తికి పెద్ద పీట వేస్తున్న ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చిల‌క‌లూరిపేట శాస‌న‌స‌భ్యురాలు విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మండ‌ల కేంద్రం నాదెండ్ల‌లో వైఎస్సార్ భ‌రోసా కార్య‌క్ర‌మాన్ని గురువారం ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేవుడు కూడా అడిగితేనే వ‌రాలిస్తాడ‌ని త‌మ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గారు అడ‌గ‌కుండానే ఎన్నో వ‌రాలు ఇస్తున్నార‌ని తెలిపారు. ఇప్పుడు ద‌స‌రా కానుక‌గా రాష్ట్రంలోని సుమారు 90 ల‌క్ష‌ల‌ మంది మ‌హిళామ త‌ల్లుల‌కు ఆర్థిక ల‌బ్ధి చేకూర్చ‌బోతున్నార‌ని చెప్పారు.

వైఎస్సార్ ఆస‌రా ప‌థ‌కం ద్వారా సుమారు 9 ల‌క్ష‌ల‌ డ్వాక్రా సంఘాల రుణ‌మాఫీ రెండో ద‌ఫా మొత్తాల‌ను ఈ రోజు నేరుగా మ‌హిళ‌ల బ్యాంకు ఖాతాల్లోకి మ‌న ప్ర‌భుత్వం జ‌మ చేస్తున్న‌ద‌ని చెప్పారు. మ‌హిళ‌ల కోసం మ‌న ప్ర‌భుత్వం ఎన్నో ప‌థ‌కాలు అమ‌లు చేస్తోందని చెప్పారు. ప‌సిపిల్ల‌ల ద‌శ‌ నుంచి అవ్వ‌ల వ‌ర‌కు అన్ని వ‌య‌సుల వారికి ఏదో ఒక ప‌థ‌కాలు నేడు మ‌న రాష్ట్రంలో మ‌గువ‌ల కోసం అమ‌ల‌వుతూనే ఉన్నాయ‌ని తెలిపారు.

_మ‌హిళ‌లంద‌రికీ మ‌న ప్ర‌భుత్వ ఒక గ‌ర్వ‌కార‌ణం

ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ మ‌న రాష్ట్రంలో త‌ల్లిబిడ్డ‌ల‌కు పౌష్టికాహారం అందించ‌డం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోష‌ణ ప్ల‌స్ అమ‌ల‌వుతోందని చెప్పారు. ఆరేళ్ల పిల్ల‌ల నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు పిల్ల‌ల చ‌దువుల కోసం అమ్మ ఒడి ప‌థ‌కం అమ‌ల‌వుతోందని తెలిపారు. ఈ ప‌థ‌కం ద్వారా త‌ల్లుల ఖాతాల‌కే నేరుగా మ‌న ప్ర‌భుత్వం ఏటా రూ.15,000 న‌గ‌దు అంద‌జేస్తున్న విష‌యం మ‌నంద‌రికీ తెలుసని చెప్పారు. ముఖ్యంగా 45 ఏళ్లు నిండిన మ‌హిళ‌లకు ఆర్థిక స్వేచ్ఛ‌ను ఇచ్చేలా వైఎస్సార్ చేయూత‌, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ప‌థ‌కాలను త‌మ ప్ర‌భుత్వ అమ‌లుచేస్తున్న‌ద‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాల ద్వారా పెద్ద మొత్తంలో ఆడ‌ప‌డుచుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ అవుతున్న‌ద‌ని చెప్పారు. మ‌హిళ‌ల సాధికార‌త కోసం ఇంత‌గా ప‌రిత‌పిస్తున్న ప్ర‌భుత్వాలు ఈ దేశంలోనే మ‌రే రాష్ట్రంలోనూ లేవ‌ని ఒక మ‌హిళా శాస‌న‌స‌భ్యురాలిగా నేను స‌గ‌ర్వంగా చెబుతున్నాన‌ని ఆనందం వ్య‌క్తంచేశారు. మ‌హిళ‌లంద‌రికీ మ‌న ప్ర‌భుత్వం ఒక గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని స్ప‌ష్టంచేశారు.

అర్హులంద‌రికీ వైఎస్సార్ ఆస‌రా

ఎమ్మెల్యే విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ వైఎస్సార్ ఆసరా పథకం లబ్ధిదారుల పేర్లను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉంచారని చెప్పారు. అర్హత ఉన్నా పొరపాటున ఆ జాబితాల్లో పేర్లు మిస్ అయిన‌ సంఘాలు ఏవైనా ఉంటే, వెంటనే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల‌ని తెలిపారు. విచారణ చేప‌ట్టి వెంట‌నే వారికి కూడా రుణాలు మంజూరు చేస్తామన్నారు.ఈ కార్య‌క్ర‌మంలో
డిపిఓ కేశవరెడ్డి,ఏరియా కో ఆర్డినేటర్ హనుమా నాయక్,ఎంపీడీఓ మోషే,ఏపీఎం భరత్,జడ్పీటీసీ కాట్రగడ్డ మస్తాన్ రావు,ఎంపీపీ తలతోటి రాణి,కో ఆప్షన్ సభ్యులు షేక్ మూసా ఇస్లాం,మున్సిపల్ చైర్మన్ రఫాని,వైస్ చైర్మన్ వలేటి వెంకటేశ్వర్లు, సుబ్బారావు,కాండ్రు శేషయ్య, మస్తాన్ వలి,యల్లారావు,వెంకటేష్ ,నరసింహారావు,నెల్లూరి వెంకయ్య మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

గీతంలో వేసవి క్రీడా శిబిరం ప్రారంభం

ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఉద్యోగుల…

9 hours ago

తెలంగాణ ఉద్యమ కారులకు సన్మానం

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…

2 days ago

అంతర్జాతీయ పోటీల్లో మెరిసిన సంగారెడ్డి మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడాకారులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…

2 days ago

నూతన పార్కుల ఏర్పాటుతో ఆరోగ్యం – ఆహ్లాదం పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…

2 days ago

ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి పటాన్ చెరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శివానందం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…

2 days ago

నాణ్యమైన బోధనకు గీతం ప్రోత్సాహం

ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: భౌతికశాస్త్ర…

2 days ago