మనవార్తలు ,నంద్యాల :
మొన్న వెలుబడిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర కళాశాలకు చెందిన విద్యార్థి 93.33 శాతం మార్కులు సాధించి నంద్యాల టౌన్ లో రెండవ స్థానాన్ని సాధించాడని కళాశాల డైరెక్టర్లు ఎం.చంద్రమౌళిశ్వర్ రెడ్డి, ఆర్ఎస్ఎల్ రంగారావులు తెలిపారు. ఎస్సీ కేటగిరిలో రాజుకు ఆల్ ఇండియా ర్యాంకులో ఐదు వేల నుంచి ఆరువేల మధ్యలో రావచ్చని వారు వెల్లడించారు. సబ్జెక్ట్ ల వారిగా హెచ్ టీ ఏ స్కోర్ ఫిజిక్స్ లో 92.74శాతం,కెమిస్ట్రీలో 92.31 శాతం మ్యాథ్స్ లో 88.36 శాతం సాధించి మొత్తం93.33 శాతం సాధించినట్లు తెలిపారు. కళాశాల పేరు ప్రతిష్టలను దశదిశలా వ్యాప్తి చేసిన కడియం రాజును కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. ఆల్ ఇండియా టాప్ ఎన్ఐటీ కళాశాలలో సీటు సాధించే అర్హతను సాధించినందుకు రాజుకు అభినందనలు తెలిపారు .
మొదటి నుంచి నిష్ణార్థులైన అధ్యాపకులచే కోచింగ్ ఇవ్వడం వల్ల ఈ విజయం సాధ్యమైందని చంద్రమౌళీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ ఫలితాలు సాధనకు కృషి చేసిన కళాశాల అధ్యాపకులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. త్వరలో జరగబోయే జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధిస్తామని యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…