దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన
ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి
నీలం మధు ముదిరాజ్
చిట్కుల్ లో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు..
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
దేశ జాతిని జాగృతం చేస్తూ, నేటి యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని యువతలో స్ఫూర్తి నింపుతూ మన దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తంగా ఇనుమడించేలా చేసిన విశ్వగురువు స్వామి వివేకానంద అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని సోమవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో చిట్కుల్ ఎన్.ఎం.ఆర్ క్యాంపు కార్యాలయంలో వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించి మన దేశ గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని కొనియాడారు.భారతదేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్న విశ్వాసాన్ని బలంగా నమ్మి ఆత్మవిశ్వాసం, ధైర్యం, కార్యదక్షత కలిగిన పౌరులుగా తయారు చేశారన్నారు. నేటి పోటీ ప్రపంచంలో చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంత ముఖ్యమో ఆయన ఆనాడే గుర్తించి యువతకి బోధనలు చేశారని అన్నారు, ఆ మహనీయుడి జన్మదినాన్ని దేశ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆయన స్ఫూర్తితో యువత ఒక లక్ష్యాన్ని ఎంచుకుని, క్రమశిక్షణతో, నిబద్ధతతో ముందుకు సాగితే విజయం తథ్యమని అభివర్ణించారు.
ఆ మహనీయుడు అందించిన సందేశం నుంచి యువత స్ఫూర్తి పొంది తమ భవిష్యత్తు ని బంగారుమయం చేసుకొవడంతో పాటు దేశ అభివృద్ధికి చేయూతనందించాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు,స్థానిక నాయకులు,తదితరులు పాల్గొన్నారు..
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…