ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు:
ముత్తంగి డివిజన్ పాటి గ్రామ పరిధిలో గల హనుమాన్ దేవాలయానికి సంబంధించిన దేవుడి మాన్యం భూమి కబ్జాకు గురవుతుందని.. కబ్జాకోరుల నుండి భూమిని కాపాడాలని కోరుతూ గ్రామస్తులు సోమవారం పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 197 లో ఒక ఎకరా 33 గుంటలు హనుమాన్ దేవాలయం పేరుపై ఉందని ఇటీవల కొందరు వ్యక్తులు ఆ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వారు ఎమ్మెల్యే జిఎంఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వా రికార్డులోనూ హనుమాన్ దేవాలయం పేరుపై ఉందని తెలిపారు. ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించి భూమి రక్షణకు పాటుపడాలని వారు విన్నవించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. ప్రభుత్వ, దేవాదాయ భూములను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు.. అతి త్వరలో పూర్తి సర్వే నిర్వహించి.. భూమి రక్షణకు సొంత నిధులతో ఫెన్సింగ్ సైతం వేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష బృందం సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సాహంగా పాల్గొంటున్న అధ్యాపకులు, సిబ్బంది పిల్లలు క్యాంపస్ లైఫ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నిర్వహణ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఉద్యోగుల…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ ఉద్యమ కారులందరం కలిసికట్టుగా పనిచేద్దామని, రాబోయే ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని గెలిపించుకుందామని…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: నేటి తరం యువతకు స్ఫూర్తిని అందించేలా అంతర్జాతీయ పోటీల్లో సంగారెడ్డి జిల్లాకు చెందిన మాస్టర్స్…
మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : అమీన్పూర్, పటాన్చెరు సర్కిళ్ల పరిధిలోని డివిజన్లలో 24 పార్కుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి అని పనిచేసే చోట అందరూ గుర్తుంచుకునేలా విధులు నిర్వర్తించినప్పుడే…
ఫిజిక్స్ అధ్యాపకుల శిక్షణ ప్రారంభోత్సవంలో గీతం అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: భౌతికశాస్త్ర…