Districts

అంగరంగ వైభవంగా సేవాభారతి అవార్డ్ ల ప్రదానోత్సవం

హక్కుల ప్రాధాన్యత గురించి వివరించిన వక్తలు

మన వార్తలు ,నెల్లూరు:

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఆవిర్భావ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో గల నెల్లూరు పట్టణం లోని శ్రీరాములు ఎన్ జి ఓ కళ్యాణ మండపం లో వరల్డ్ హ్యూమన్ రైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నిర్వహించిన సేవాభారతి అవార్డ్ 2021 ప్రదానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అన్ని జిల్లాల నుండి 115 మంది హాజరై విజయవంతం చేయడమైనది అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో సేవా భారతి అవార్డ్ రావడానికి కృషి చేసిన సంతోష్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడం అయినది మెదక్ జిల్లా రేగోడ్ మండలం ప్యారారం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఉమ్మడి మెదక్ జిల్లా మానవ హక్కుల సంఘం చైర్మన్ తెనుగు నర్సింలు ను సేవాభారతి అవార్డ్ తో సత్కరించడం జరిగింది.

జాతీయ చైర్మన్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ73 వ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నామని, ప్రతీ ఒక్కరూనిరాశవీడండి, హక్కులు తెలుసుకుంటూ, తెలియజేస్తూ ఉండాలని సూచించారు. మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో వివిధ రంఘాల్లో సేవలు అందిస్తున్న 240 మందికి సేవాభారతి అవార్డుతో సత్కరించడం జరిగిoదని తెలిపారు. అసోసియేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 6 దేశాల్లో తమ సంస్థ విస్తరించిందని తెలిపారు. ఆగస్టు 15 న ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు.

ఎవరికి ఏ సమస్య వచ్చినా తీర్చడానికి తాము ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. రేపటి వెలుగుల ప్రపంచం కోసం పాటు పడాలని సూచించారు. చిత్తశుద్ధితో పనిచేయడం కోసం సంఘం సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి అవార్డులు అందజేశారు.ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ స్రవంతి,రిటైడ్ జిల్లా జడ్జి మాల్యాద్రి,జిల్లా యూత్ ఆఫీసర్ మహేందర్ రెడ్డి, బార్ కౌన్సిల్ మెంబర్ చంద్రశేఖర్ రెడ్డి,డబ్బు హెచ్ ఆట ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు,తెలంగాణ రాష్ట్రo నుండి వివిధ జిల్లాల చైర్మన్లు తదితరులు హాజరయ్యారు.

 

Ramesh

Recent Posts

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

1 day ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

1 day ago

గీతంలో వందేమాతరం 150వ వార్షికోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…

1 day ago

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

2 days ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

2 days ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

3 days ago